తెలంగాణ

పల్లెల్లో పంచాయతీ మంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 22: గ్రామ పంచాయతీ ఎన్నికలతో పల్లెసీమల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఈ వేడి మరింతగా పెరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో సోమవారం 500 పైచీలుకు పంచాయతీలకు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసాయి. మెజార్టీ స్థానాలను అధికార టీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకోగా రెండవ స్థానంలో కాంగ్రెస్ కొనసాగుతుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు వివిధ రకాలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. డబ్బులు, మద్యం, ఇతర వస్తు, దుస్తు రూపేణా ఓటర్ల ప్రాపకం కోసం అభ్యర్థులు కష్టాలు పడుతున్నారు. 500 ఓటర్లు ఉన్న చిన్న పంచాయతీలు మొదలుకుని వేలల్లో ఓటర్లు ఉన్న పంచాయతీల్లో సైతం డబ్బుల పంపకం జోరుమీదుండగా, మద్యం ఏరులై పారుతోంది. పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలన్న తాపత్రాయానికన్నా తమ వ్యక్తిగత పరువు, ప్రతిష్టలే ముఖ్యంగా బావిస్తున్న గ్రామ స్థాయి నాయకులు పరస్పరం పోటీకి దిగారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ జోరుమీదుండగా రెండవ విడతలో కూడా అదే జోరు కనబర్చాలని తమ మద్దతుదారులను ప్రోత్సహించే పనిలో నిమగ్నమయ్యారు. బరిలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ప్రచార జోరును కనబరుస్తున్నారు. ఈ నెల 25వ తేదీన రెండవ విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగనుండగా 30వ తేదీన మూడవ విడతతో పంచాయతీ ఎన్నికల పర్వం ముగియనుంది. వారం రోజుల పాటు గ్రామాల్లో ఇంకా పంచాయతీ ఎన్నికల వేడి వాతావరణం ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు శాఖ కూడా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడు జిల్లాల పరిధిలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా పార్టీల నాయకులకు తగిన సూచనలు, హెచ్చరికలు చేసారు.