తెలంగాణ

తెలంగాణ సచివాలయం కోసం బైసన్ భూమిని వెంటనే ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: తెలంగాణకు మంచి సచివాలయం నిర్మించేందుకు వీలుగా సైన్యానికి చెందిన బైసన్ పోలోమైదానాన్ని తమకు రాష్ట్రానికి వెంటనే ఇవ్వాలని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజప్తి చేశారు. పదహారవ లోక్‌సభలో ఆయన ముగింపు ఉపన్యాసం ఇస్తూ బైసన్ పోలోగ్రౌండ్‌ను తెలంగాణకు కేటాయించేందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం పీఎం కార్యాలయంలో ఉందన్నారు. దానిపై వెంటనే నిర్ణయం తీసుకుని, తెలంగాణకు కేటాయించాలని విజప్తి చేశారు. పదహారవ లోక్‌సభ కాలం పూర్తయ్యేలోగా బైసన్ పోలోగ్రౌండ్‌ను తెలంగాణకు కేటాయిస్తే బాగుంటుందని జితేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బైసన్ పోలోగ్రౌండ్‌లో ఒక బ్రహ్మాండమైన సెక్రటటేరియట్‌ను నిర్మించాలన్నది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలగా ఆయన అభివర్ణించారు.