తెలంగాణ

తెలంగాణలో రెండు ఎంపీ స్థానాల్లో సీపీఐ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 13: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) రెండు స్థానాల్లో తప్పనిసరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. ఖమ్మంలో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, భువనగిరి నియోజకవర్గాల్లో పోటీ చేయాలని స్థూలంగా నిర్ణయించి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశామని, ఈ నాలుగు స్థానాల్లో రెండు స్థానాల్లో తప్పనిసరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ నెల 19వ తేదీన భువనగిరి, 20వ తేదీన మహబూబాబాద్, 25న ఖమ్మంల్లో పార్లమెంటుస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. నాలుగు స్థానాల్లో పోటీకి సిద్దమవుతున్నప్పటికీ రెండింటిలో తప్పనిసరిగా పోటీ చేస్తామన్నారు. ఎన్నికల్లో పొత్తులపై ఎవరితోనూ చర్చించలేదని అన్నారు.