తెలంగాణ

మీ నిర్వాకం వల్లే మంజీరా రిజర్వాయర్ ఎండిపోయింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ‘మీ నిర్వాకం వల్లే మంజీరా రిజర్వాయర్ ఎండిపోయింది’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావుపై మండిపడ్డారు. 2017లో మంజీర నీటిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు అక్రమంగా తరలించింది నిజం కాదా? అని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. తాగు నీటి కోసం ఉన్న మంజీర నీటిని ఎందుకు తరలించారని ఆయన ప్రశ్నించారు. డెడ్ స్టోరేజీ వాటర్ కూడా లేకుండా తరలించింది నిజం కాదా? అని అన్నారు. హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియకుండా ఈ పని చేసి ఉంటారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి తెలిసి ఉంటే అనుమతి ఇచ్చే వారు కాదని ఆయన చెప్పారు. హరీష్ అర్థరాత్రి మంజీరా నీటిని దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. అవి హరీష్ రావు నీళ్ళు కాదని, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల నీళ్ళు అని ఆయన తెలిపారు. దీనికి హరీష్, నీటి పారుదల శాఖ అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని జగ్గారెడ్డి కోరారు.