తెలంగాణ

సీపీఐ నేతలతో చల్లా చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చల్లా వంశీచంద్‌రెడ్డి సీపీఐ పార్టీ మద్దత్తు కోరారు. ఈ మేరకు గురువారం సీపీఐ రాష్ట్ర పార్టీ ముఖ్ధూం భవనంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని కలిశారు. ఏప్రిల్ 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తనకు మద్దత్తు ఇవ్వాలని ఆయన చాడకు చూచించారు. వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ,తెరాస పార్టీలను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని వారు ప్రకటించారు. దేశంలో మతోన్మాద శక్తులను పోషిస్తున్న బీజేపీని, అలాగే పార్టీ ఫిరాంపులను ఎగదోస్తున్న తెరాస పార్టీలను గద్దెదించాలని వారు పిలుపు ఇచ్చారు. పతకం ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రతిపక్షం పార్టీలను నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ఓటర్ల బుద్ధిచెప్పాలన్నారు.