తెలంగాణ

బీజేపీ రాష్ట్ర బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ గురువారం ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుప్రశాంతంగా ముగిసింది. కాని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. బంద్ సందర్భంగా హైదరాబాద్‌లో రెండు వేల మంది పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం ఐదు వేల మందికి పైగా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. మరోవైపు ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నాల్గవ రోజుకు చేరుకుంది. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న లక్ష్మణ్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వైద్యులు హుటావుటిన హాజరై వైద్య చికిత్స అందిస్తున్నారు. బంద్‌లో భాగంగా బీజేపీ కార్యకర్తలు గురువారం ఉదయం సచివాలయం వద్ద బైఠాయించి పెద్ద ఎత్తుననిరసన తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని, ఇంటర్ బోర్డు వైఫల్యాలపై న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులను తొలగించాలని బీజేపీ నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధర్‌రావు, సీనియర్ నేత, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీ మనోహర్ రెడ్డి, నగర మాజీ అధ్యక్షులు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ప్రధానకార్యదర్శి గౌతమరావును పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ఇంటర్ బోర్డువైఫల్యాలను వెనకేసుకుని వచ్చే ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. రాష్ట్రంలో నియంతృత్వం రాజ్యమేలుతోందని, అప్రజాస్వామిక విధానాల ద్వారా ప్రజా ఉద్యమాలను అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇవన్నీ సర్కారీ హత్యలేనని ఆయన అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు నిమ్స్ ఆసుపత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 9.75 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేసే దాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఈప్రభుత్వ హత్యలపై పోరాటం చేస్తామన్నారు. బీజేపీ ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైందని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.
చిత్రాలు.. సచివాలయం ఎదుట బైఠాయించిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తదితరులు
*అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ శవయాత్ర నిర్వహిస్తున్న దృశ్యం (ఇన్‌సెట్‌లో)