తెలంగాణ

సీఎల్పీ నేత భట్టికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 2: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లోప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరిట పర్యటిస్తున్న కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అస్వస్థతకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాలలో పర్యటించిన ఆయన బుధవారం రాత్రి కొత్తగూడెంలో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మారుమూల అటవీ ప్రాంతాలలో పర్యటించిన ఆయనను వెంటనే చిక్సిత నిమిత్తం ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వేసవి తీవ్రత కారణంగా వడదెబ్బకు గురయ్యారని, నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. దీంతో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను నాలుగు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు.