తెలంగాణ

వాగ్దానాల్లో దిట్ట..కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినేపల్లి, మే 3: ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేయడం ఎన్నికల తరువాత మరిచిపోవడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు వీ. హన్మంత్‌రావు అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా మండలంలోని గంగారంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మండలంలోని మార్కెండేయ చెరువును రిజర్వాయర్‌గా మారుస్తామనే వాగ్దానం చేసి ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
కృష్ణానీళ్లు పక్కన వెళ్లుతున్న గంగారం గ్రామంలో సాగునీరుకు నోచుకోలేదని, లక్షలు వెచ్చించి నిర్మించిన సబ్ స్టేషన్‌లో సిబ్బంది లేకుండా వృద్దాగా ఉందని, నలుగురు సిబ్బంది ప్రభుత్వానికి దొరకరా అని ప్రశించారు. దేశంలోనే రాష్ట్రం నెంబర్‌వన్ అని గొప్పలు చెప్పుకుంటున్న గ్రామాలలో చిన్న సమస్యలను పరిష్కరించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.