తెలంగాణ

సకాలంలో రైతులకు విత్తనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: తెలంగాణ రైతులకు 2019 ఖరీఫ్ సీజన్‌కోసం అవసరమైన విత్తనాలను సకాలంలో అందిస్తామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. విత్తనాల పంపిణీపై చర్చించేందుకు శనివారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ, వ్యవసాయ ఉత్పత్తులను గణనీయంగా పెంచేందుకు నాణ్యమైన విత్తనాలే కీలకంగా ఉంటాయన్నారు. విత్తనాల్లో కల్తీలేకుండా చూడాలని, ఇందుకోసం విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, విక్రయ కేంద్రాలు, గోదాములు తనిఖీ చేయాలని ఆదేశించారు. తెలంగాణలో హెచ్‌టీ పత్తివిత్తనాలను నియంత్రిస్తున్నామన్నారు. హెచ్‌టీ పత్తివిత్తనాల విషయంలో గతంలో కఠిన చర్యలు తీసుకున్నామని, అదే విధంగా ఈ సంవత్సరం కూడా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఐజీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ, కల్తీ విత్తనాల నియంత్రణకోసం అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. కల్తీ విత్తనాలను సరఫరా చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలోకి కల్తీవిత్తనాలు రాకుండా తనిఖీలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ఉద్యాన కమిషనర్ ఎల్. వెంకటరామిరెడ్డి, విత్తన ధృవీకరణ, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.