తెలంగాణ

రాహులే కాబోయే ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంపోడు, మే 4: దేశానికి కాబోయే ప్రధాని రాహుల్‌గాంధీ అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని కొప్పోలు, కట్టవారిగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 23న వెలువడే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుపొంది దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రాదేశిక ఎన్నికలు కీలకమని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్ధులను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి నెలకు రూ.6వేలు, సంవత్సరానికి రూ.72వేలు అందిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఎ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీటీసీ అ భ్యర్థ్ధి చెన్నమల్ల మాధవి జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్ధి ఆవుల వెంకన్న, నాయకులు కాటేపల్లి రాధాకృష్ణ, బొమ్ము శ్రీనివాస్, మనిపాల్‌రెడ్డి, పెద్ద నాగరాజు, పందుల రమేష్, టంగుటూరి సురేష్ తదతరులు పాల్గొన్నారు.
చిత్రం... ప్రచారంలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి