తెలంగాణ

పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగాల, మే 4: రాష్టవ్య్రాప్తంగా మూడు విడతల్లో జరగబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తొలి విడతలో జరిగే పరిషత్ ఎన్నికల్లో భాగంగా మునగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఆయువుపట్టైన మునగాల మండలంలో మూడు రంగుల జెండాను పరిషత్ ఎన్నికల్లో ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన అధై ర్య పడొద్దని, వారికి పుట్టగతులుండవన్నారు. పరిషత్ ఎన్నికల్లో సీపీఎం పార్టీతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే మండలంలోని జడ్పీటీసీలతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలకు ఉందన్నారు. ప్రజాసేవే పరమావధిగా రాష్టప్రతి భవన్‌లో ఉన్న ఉన్నతమైన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నానన్నారు. పార్టీ కోసం సేవ చేసే ప్రతి కార్యకర్తను గుర్తించి సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.జైపాల్‌రెడ్డి, కళాకారుల బృందం నాయకుడు మాతంగి బసవయ్య, గ్రామ మాజీ సర్పంచులు కె.కోటేశ్వరరావు, బి.అక్కమ్మశంకర్‌తోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు.
చిత్రం... కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి