తెలంగాణ

జాతీయ మానవ హక్కుల శిక్షణకు శ్రీకాంత్ గుప్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం(గుమ్మడిదల), మే 7: ఢిల్లీలో జరిగే జాతీయ మానవ హక్కుల సంఘం ఇంటర్న్‌షిప్‌కు గుమ్మడిదల మండలం బొంతపల్లి వాసి ఎంపికయ్యారు. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి గ్రామంలోని వీరభద్రనగర్‌కు చెందిన ఎం.శ్రీకాంత్‌గుప్త హైదరాబాద్‌లోని పెండెకంటి లా కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా దేశ వ్యాప్తంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆద్వర్యంలో జరిగే శిక్షణా తరగతులకు 60 మందిని ఎంపిక చేయగా తెలంగాణ రాష్ట్రం నుండి నలుగురిని ఎంపిక చేశారు. అందులో బొంతపల్లికి చెందిన శ్రీకాంత్‌గుప్త ఒకరు. మే 16వ తేదీ నుండి జూన్ 12 వరకు శిక్షణా తరగతులతో పాటు ఇంటర్న్‌షిప్ వుంటుందని వెల్లడించారు. మానవ హక్కులు వాటి పరిరక్షణ తదితర ఆంశాలపై అక్కడ శిక్షణ వుంటుందని ఈ నెల 12న ఢిల్లీకి బయలుదేరనున్నట్టు వెల్లడించారు.