తెలంగాణ

2 ఎంపీటీసీ స్థానాలకు 14న రీ-పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: బ్యాలెట్ పేపర్లు తారుమారు కావడం, పొరపాట్లు జరగడంతో రాష్ట్రంలోని రెండు ఎంపీటీసీ నియోజకవర్గాలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 14 న రీ-పోలింగ్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డి మండలంలోని అల్వాల్ ఎంపీటీసీ నియోజక వర్గంలోని 50 వ పోలింగ్ స్టేషన్‌లో ఈ నెల 14 న రీ-పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్ ఎంపీటీసీ నియోజకవర్గంలోని 111 వ పోలింగ్ స్టేషన్‌లో కూడా ఈ నెల 14 న రీ-పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని సంబంధిత అభ్యర్థులకు, ప్రజలకు తెలియ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను నాగిరెడ్డి ఆదేశించారు.