తెలంగాణ

వడదెబ్బకు ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, మెట్‌పల్లి, మే 13: తెలంగాణలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. యాదగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాల్టీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కొరగోని చెన్నమ్మ (60) మంగళవారం వడదెబ్బకు గురై మరణించింది. గత మూడు రోజులుగా వడదెబ్బతో అస్వస్థతకు గురైన ఆమెను చికిత్సకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో వడదెబ్బతో 32 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన నాబాజీ బాలాజీకి భార్య విడాకులు ఇవ్వడంతో అప్పడి నుండి మద్యానికి బానిసయ్యాడు. సోమవారం మద్యం సేవించి పట్టణంలో వ్యవసాయ మార్కెట్‌యార్డులో పడిపోయాడు. ఎండతీవ్రంగా ఉండడంతో వడదెబ్బ తగిలి బాలాజీ మృతి చెందినట్టు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. మృతుడి సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.