తెలంగాణ

పువ్వాడ, చిట్టెంపై అనర్హత వేటు వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: తమ పార్టీ నుంచి ఎన్నికై టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్ కుమార్, చిట్టెం రాంమోహన్ రెడ్డిల శాసనసభ్యత్వాలను రద్దు చేయాల్సిందిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జె.గీతారెడ్డి, సంపత్‌కుమార్, పద్మావతి, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ లోగడ కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని గుర్తు చేశారు. అయితే వాటిపై ఇప్పటి వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని, కనీసం సమాధానం కూడా ఇవ్వలేదని అన్నారు. ఇలా చేస్తే స్పీకర్‌పై నమ్మకం సన్నగిల్లుతుందని వారు అన్నారు.