తెలంగాణ

మరోసారి పెల్లుబికిన మహిళల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూన్ 28: మల్లన్నసాగర్‌కు భూములు రిజిస్ట్రేషన్ చేసిన రైతుల పంటల పై మహిళలు మరోసారి ఆగ్రహించి ధ్వంసం చేసిన సంఘటన మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పలువురు రైతులు ప్రాజెక్టు కోసం రిజిస్ట్రేషన్లు చేయగా కొన్ని రోజుల క్రితం మహిళలు వారి పంటలపై దాడి చేయకున్నా కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ మరోసారి ఐదుగురి రైతుల మొక్కజొన్న, పత్తి పంటలను ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన మహిళలు పెద్దసంఖ్యలో వెళ్లి పున్నారెడ్డి, కుమ్మరి స్వామి, నర్సింహరెడ్డి, ముత్యంరెడ్డి, విధువౌళి, అంజాగౌడ్‌లకు చెందిన సుమారు 20ఎకరాల పంటలను ధ్వంసం చేశారు. గ్రామస్థుల నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు.