తెలంగాణ

మున్సి‘పోల్’పై నేతలతో 15న ఈసీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సిన 129 మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను మున్సిపల్ కమిషనర్లు ఈ నెల 14 న రూపొందించాలని, జూలై 15 న ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కమిషనర్లు, స్పెషల్ ఆఫీసర్లు 15 న రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలను సేకరించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ పేరుతో సర్క్యులర్ జారీ అయింది. జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్లు, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు సమాచారం అందించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉంటే జూలై 17 వరకు లిఖిత పూర్వకంగా తెలపాల్సి ఉంటుంది. 18 న ఈ అభ్యంతరాలను డిస్పోజ్ చేస్తారు. 18 న తుది పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందిస్తారు. జిల్లా ఎన్నికల అధికారి ఈ నెల 19 న ఆమోదం తెలపాలని, అదే రోజు తుది జాబితా ప్రకటించాలని ఆదేశించారు.