తెలంగాణ

మల్లన్నసాగర్ రైతులను భూసేకరణపై ఒత్తిడి చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: మెదక్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రైతుల నుంచి జీవో 123 కింద బలవంతంగా భూములను సేకరించమని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ కేసును హైకోర్ట్ధుర్మాసనం విచారించింది. తమ భూములను ప్రభుత్వం జీవో 123 కింద సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఉపేందర్ రెడ్డి మరో 14 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా రైతుల నుంచి జీవో 123 కింద భూములను బలవంతంగా సేకరించబోమని ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి కె ప్రదీప్ చంద్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని పిటిషన్‌ను మూసివేసింది.