తెలంగాణ

పీసీసీ పదవి ఇస్తానంటే నేనే వద్దన్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: ‘పీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇస్తానంటే నేనే వద్దన్న’ అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వద్దన్నాకే ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పేరు పరిశీలిస్తున్నారన్నారు. శాసనసభ ఆవరణలో శుక్రవారం మీడియాతో రాజ్‌గోపాల్‌రెడ్డి చిట్ చాట్ చేశారు. తాను బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెసోళ్లు ఇంకా చాలా మంది బీజేపీలో చేరబోతున్నారన్నారు. కాంగ్రెస్ డేట్ ఎక్స్‌పైర్ అయిన మేడిసిన్ లాంటిదని వ్యాఖ్యానించారు. అది మునిగే పడవ అన్నారు. టైటానిక్ పడవలో నాలాంటి హీరో ఉన్నా మునిగిపోవాల్సిందేనన్నారు. నా లాంటోడు బీజేపీ చేరితే ఆ పార్టీ బలపడుతుందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని రాజ్‌గోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరుతారన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళుతున్నారంటే టీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందన్నారు.