తెలంగాణ

పెట్రోల్ బంకు యజమానిపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, జూలై 2: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రాంచంద్రగూడెం నార్కట్‌పల్లి-అద్దంకి బైపాస్ రోడ్డు చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి మోటార్ సైకిల్‌పై 6.33 లక్షల రూపాయల బ్యాగుతో వెళ్తున్న పెట్రోల్ బంకు యజమానిపై ముసుగుదొంగలు దాడి చేసి డబ్బుబ్యాగుతో పరారయ్యారు. వేములపల్లి మండలం అన్నపురెడ్డి గ్రామం వద్ద ఉన్న వేణుగోపాల్ ఫిల్లింగ్ స్టేషన్ యజమాని కం క్యాషియర్ దేవులపల్లి వెంకటేశ్వర్లు డబ్బులు బ్యాగులో పెట్టుకుని మిర్యాలగూడలోని తన ఇంటికి మోటార్‌సైకిల్ వస్తుండగా, ముగ్గురు ముసుగు ధరించిన దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చి రాంచంద్రగూడం చౌరస్తా వద్ద వెంకటేశ్వర్లు మోటార్ సైకిల్‌ను నెట్టడంతో పడిపోయాడు. దీంతో వెంటనే డబ్బున్న బ్యాగును తీసుకుని దుండగులు పరారవుతుండగా వెంకటేశ్వర్లు బ్యాగు పట్టుకుని పెనుగులాడిన విడిపించుకుని దుండగులు పారిపోయారు. మోటార్‌సైకిల్‌పై నుండి కింద పడ్డ వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే ఒన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటన స్థలానికి ఇన్స్‌పెక్టర్ డి.బిక్షపతి చేరుకుని విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు.