తెలంగాణ
సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 26 October 2019
హైదరాబాద్, అక్టోబర్ 25: ఒకే నెలలో సింగరేణి కార్మికులు రెండు బోనస్లు అందుకోవడం సింగరేణి చరిత్రలోనే రికార్డు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా సింగరేణి తన లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించింది. దీపావళి బోనస్గా రూ. 258 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థ శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 1వ తేదీన దసరా పండుగ సందర్భంగా ఒక్కో కార్మికునికి లక్ష రూపాయలు అందచేశారు. దీనికి తోడుగా దీపావళి బోనస్ రూ. 64,700/ రూపాయలు చెల్లించారు. రెండు బోనస్లు కలపి లక్షా 67వేల ఏడువందల రూపాయలు కార్మికులకు దక్కడం పట్ల కార్మిక యూనియన్లు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.