తెలంగాణ

గవర్నర్‌ను కలిసిన వీహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు శుక్రవారం ఇక్కడ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలుసుకుని ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఆర్టీసీ సమ్మె, ప్రజలు బాధపడుతున్న బాధలు, ప్రభుత్వ పనితీరును వివరించినట్లు వీహెచ్ చెప్పారు. కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను అవమానించారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని, 21 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా వారి సమస్యలను పట్టించుకోకుండా నియంతలా కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. ఈ నెల 31వ తేదీన తన ఇంట్లో జరిగే సత్యనారాయం స్వామి వ్రతానికి గవర్నర్‌ను ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు.