తెలంగాణ

అప్రెంటిస్‌షిప్‌లో తెలంగాణకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: ఐటీఐ అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్ అవకాశాలు కల్పించే విషయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిబంధనలను పాటించనందు వల్ల తెలంగాణ యువతకు తీరని అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్ అవకాశాలు కల్పించే విషయంలో స్థానిక ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలో పేరునమోదు చేసుకున్న వారికే అన్న నిబంధనలు కచ్చితంగా అమలు చేసే విధంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను ఆదేశించాలన్నారు. ఈ నిబంధనలు ఉన్నా, వీటిని అమలు చేయడం లేదన్నారు. ఈ కారణంగా ఉత్తరాది రాష్ట్రాలు యుపీ, బిహార్ వంటి రాష్ట్రాలకు చెందిన అభ్యిర్థులు అప్రెంటిస్ షిప్‌లో పెద్ద ఎత్తున చేరుతున్నారన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీఐ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. అప్రెంటిస్ షిప్ చేసిన వారికి రైల్వే గ్రూప్ డీ ఉద్యోగ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ అవకాశాన్ని తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కోల్పోతున్నారనన్నారు. ఈ చట్టాన్ని 1961లో రూపొందించి, 2014లో సవరించారన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయాలన్నారు.