తెలంగాణ

ప్రతి జిల్లాలో కేన్సర్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: ప్రతి జిల్లాలో కేన్సర్ వ్యాధి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. కేన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందని, ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నివారణకు సరైన వైద్య సదుపాయాలు లేవన్నారు. ఆర్థిక ఇబ్బందులతో కేన్సర్ బాధితులు సరైన వైద్య చికిత్స చేయించుకోలేకపోతున్నారు. ఈ సమస్య సంగారెడ్డికి పరిమితం కాదని, దేశంలో అన్ని ప్రాంతాల్లో కేన్సర్ మహమ్మారి విజృంభించిందన్నారు. ప్రతి రోగికి కేన్సర్ వైద్య సేవలు అందించాలన్నారు. ప్రత్యేక వైద్య పథకాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సీఎం అపాయింట్‌మెంట్ ఇస్తే కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని, కేన్సర్ వ్యాధిపై గణాంక వివరాలు సేకరించానన్నారు. తన డిమాండ్‌పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పందించాలన్నారు.