తెలంగాణ

ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి కోరుట్ల ఎమ్మెల్యే పీఏ గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల రూరల్, నవంబర్ 3: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పీఏ గిరీష్‌ఠాకూర్ ఆదివారం ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి గల్లంతయ్యారు. ఎస్సై చిర్ర సతీష్ కథనం మేరకు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గిరీష్‌ఠాకూర్ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పీఏగా పని చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. అదే అపార్ట్‌మెంట్‌లో నివాసముండే ముగ్గురు మిత్రులతో కలిసి ఆదివారం సెలవుదినం కావడంతో అంతర్గాం బైపాస్ సమీపంలోని ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ వద్దకు వెళ్లారు. తన ముగ్గురు మిత్రులతో పాటు గిరీష్ వాటర్‌ఫ్లో చూడడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్‌లో పడి గల్లంతైనట్టు వివరించారు. కాగా గిరీష్‌ఠాకూర్ మిత్రులతో విందు చేసుకోవడానికి వెళ్లినట్టు సమాచారం. గిరీష్ ఠాకూర్ గల్లంతైన విషయం తెలిసిన వెంటనే జగిత్యాల రూరల్ పొలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గిరీష్‌ఠాకూర్ ఆచూకీకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఎస్సారెస్పీ కెనాల్‌లో గల్లంతైన గిరీష్ ఠాకూర్ (ఫైల్‌ఫొటో)