తెలంగాణ

ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఆదివారం మహాదీక్షను చేపట్టేందుకు ప్రయత్నించిన సబ్బండ వర్గాల నేతలను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, పేదలు కలిసి ఇక్కడి ఇందిరాపార్క్ వద్ద ఆదివారం మహాధీక్ష చేసేందుకు ప్రభుత్వం అనుమతి కోరామని బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ తదితరులు గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల్లో సబ్బండ వర్గాల వారే ఎక్కువగా ఉన్నారని వారికి న్యాయం చేకూర్చాలన్నదే తమ లక్ష్యమన్నారు. అందుకే మహాధీక్ష తలపెట్టామన్నారు. ప్రభుత్వ అనుమతి కోసం ముందుగానే దరఖాస్తు చేసినప్పటికీ, శనివారం సాయంత్రం వరకు కూడా గమ్మున ఉన్న పోలీసులు ఆ తర్వాత అనుమతి ఇవ్వడం లేదని ప్రకటించారని ఆరోపించారు. తాము కోర్టు ద్వారా అనుమతి తీసుకునేందుకు కూడా పోలీసులు అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తే నష్టపోయేది సబ్బండవర్గాలేనని సురేష్ తదితరులు పేర్కొన్నారు. ప్రైవేట్‌పరం చేయడం వల్ల ఈ వర్గాల ప్రజల ఉద్యోగాలకు విఘాతం కలుగుతుందన్నారు. విద్యార్థులతో పాటు సమాజంలో అర్హత కలిగిన వారందరి పాస్‌లు రద్దవుతాయన్నారు. ప్రైవేట్‌పరం పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం అమ్మివేస్తుందని ఆరోపించారు. ఈ పరిస్థితిలోనే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు, ఆర్టీసీని కాపాడేందుకు, సబ్బండ వర్గాల ఉద్యోగులకు చేయూత ఇచ్చేందుకు మహాధీక్ష తలపెట్టామన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వం ఉద్దేశప్వూకంగానే ధీక్షకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. భారత రాజ్యాంగం ప్రజలకు భావస్వేచ్ఛ ప్రకటన ఇచ్చిందని, ఈ స్వేచ్ఛకు ప్రభుత్వం, పోలీసులు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? నిరంకుశ ప్రభుత్వమా ? అంటూ సురేష్ తదితరులు ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని, ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుస్తామని సురేష్ తదితరులు స్పష్టం చే శారు. ముఖ్యమంత్రి బెదిరిస్తున్నప్పటికీ, సమ్మెను కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులను వారు అభినందించారు. మహాధీక్ష కోసం ముందుకు వచ్చి అరెస్టయిన వారిలో సురేష్‌తో పాటు ఎమ్మార్పీస్ జాతీయ కార్యదర్శి నల్ల లక్ష్మణ్, టీజెఎంయు మహిళా అధ్యక్షురాలు బీ. అరుణ, ఆర్టీసీ జాక్ 1 కన్వీనర్ హనుమంతు ముదిరాజ్, టీజెఎంయు అధక్షుడు సుధాకర్, జాక్1 కో-కన్వీనర్లు సుద్దాల సురేష్, పున్న హరికిషన్, టీఎన్‌టీయుసీ నేత యాదయ్య తదితరులు ఉన్నారు.