తెలంగాణ

కొనసాగుతున్న జోగినపల్లి ‘గ్రీన్ చాలెంజ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌కు విశేష స్పందన వస్తోంది. దేశవిదేశాల్లో ప్రముఖులు మొక్కలను నాటారు. తాజాగా సినీ రంగం ప్రముఖులు కూడా జోగినపల్లి ఛాలెంజ్‌ను స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా లాంకోహిల్స్ సమీపాన గల జీహెచ్‌ఎంసీ పార్క్‌లో సినీ నటీమణులు రజిత, రాగిణి తదితరులు ఆదివారం మొక్కలను నాటారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ తలపెట్టిన హరితహారం వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతుందని, దీవివల్ల ప్రజల వాతావణం కలుషితరహితంగా మారుతుందన్నారు. హరితహారం ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ప్రతిఒక్కరూ హరితహారంలో భాగస్వామ్యం కావాలని వారు పిలుపు ఇచ్చారు.