తెలంగాణ

ఏపీలో మంత్రి జగదీశ్‌రెడ్డి విస్తృత పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 1: నిరంతరం అధికారిక కార్యక్రమాలతో తీరికలేకుండా ఉండే రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తన మిత్రుని కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పొరుగు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తూ అటు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఇటు దర్శనీయ ప్రాంతాలను చూస్తు ఉత్సహంగా, ఉల్లాసంగా గడుపుతున్నారు. శనివారం పాలకొల్లులో జరిగిన వివాహ వేడుకకు హాజరై అంతర్వేది లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో గల రామేశ్వర దేవాలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి పూజలు చేశారు. పాలకొల్లులోని స్వయంభు క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయంలోనూ సతీమణి సునీతారెడ్డితో పాటు తండ్రి రామచంద్రారెడ్డి, సోదరులు, ఇతర కుటుంబసభ్యులు తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్‌కుమార్‌లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంతర్వేది సమీపంలోని సముద్రం ఒడ్డున మిత్రులు, బంధువులతో సరదాగా కాలక్షేపం చేశారు. అక్కడికి సమీపంలోని ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణశాఖ మంత్రి, ఆచంట శాసనసభ్యులు రంగనాధరాజు ఇంటికి వెళ్లిన మంత్రికి సాదరంగా స్వాగతం పలికి ఆతిధ్యమిచ్చారు. అనంతరం ఏపీ మంత్రి రంగనాధరాజు వ్యవసాయ క్షేత్రాన్ని జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే గాదరి కిశోర్ తదితరులు సందర్శించారు. ఈకార్యక్రమాల్లో మంత్రి వెంట రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యులు ఒంటెద్దు నర్సింహరెడ్డి, మంత్రి మిత్రుడు, న్యాయవాది నంద్యాల దయాకర్‌రెడ్డి, కట్టా వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.