తెలంగాణ

పర్యావరణ పరిరక్షణకు ‘సర్కిల్స్ రన్ ఫర్ గ్రీనర్ ఫ్యూచర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: పర్యావరణ పరిరక్షణ వల్లనే వాతావరణ కాలుష్యం బారి నుంచి మానవాళిని కాపాడుతామని, ఈ యజ్ఞంలో ప్రజలందరూ పాల్గొనాలని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ ఆయన ఎస్‌బీఐ అమరావతి, హైదరాబాద్ సర్కిళ్ల అధికారులు పీపుల్స్ ప్లాజాలో ఎస్‌బీఐ గ్రీన్ పరుగును నిర్వహించారు. రన్ ఫర్ గ్రీనర్ ఫ్యూచర్ కార్యక్రమంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కాశ్యప్, డీఎండీ బీ రమేష్ బాబు, డీఎండీ సందీప్ తివారీ, అమరావతి సర్కిల్ సీజీఎం మణి పల్వీసన్, సీజీఎం ఓపీ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఏడు వేల మంది ఎస్‌బీఐ సిబ్బంది పర్యావరణ పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేష రంజన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎస్‌బీఐ చేస్తున్న కృషిని ప్రశంసించారు. జాతీయ స్థాయిలో 15 నగరాల్లో ఎస్‌బీఐ పర్యావరణ పరుగును నిర్వహించింది.
'చిత్రం... ఎస్‌బీఐ గ్రీన్ పరుగును ప్రారంభిస్తున్న దృశ్యం