తెలంగాణ

మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తెలంగాణ పోలీసుల లక్ష్యమని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పోలీసు ఉన్నాతాధికారులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో డీజీపీ పాల్గొని ప్రసంగించారు. కొత్త సంవత్సరంలో సరికొత్త ఆధునిక ఆలోచనలు, పరిజ్ఞానంతో పౌరుల రక్షణకు పోలీస్ శాఖ పలు చర్యలను చేపడుతోందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ, మహిళల భద్రత వంటి అనేక విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసు అధికారులు ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు డాక్టర్ జితేందర్, అశోక్ మేహత, మహేష్ భగవత్, నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.
'చిత్రం... వివిధ విభాగాల పోలీసు అధికారులతో డీజీపీ మహేందర్‌రెడ్డి