తెలంగాణ

ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావును శనివారం తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు మమత, ఎంబీ.కృష్ణయాదవ్ ఇతర నాయకులతో కూడిన ప్రతినిధుల బృందం కేటీఆర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందజేసే గురుతర బాధ్యత అధికారులకు ఉన్నదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని కేటీఆర్‌కు విన్నవించారు. ఈ కార్యక్రంలో టీజీవో నేతలు సత్యనారాయణ, ఎంబీ.కృష్ణయాదవ్, హరికృష్ణ, మహ్మద్ అబ్దుల్ ఖాదర్ తదితరులున్నారు.
'చిత్రం... మంత్రి కేటీఆర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న టీజీవో అధ్యక్షురాలు మమత, కృష్ణయాదవ్