తెలంగాణ

ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికీ చేరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు నేరుగా పేదవాడికి చేరుకునేలా చూడాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ క్యాలెండర్, డైరీ, సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగింది. కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఎస్సీ, ఎస్టీ కమిషన్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు విద్యాసాగర్, ఎన్.రాంబాల్ నాయక్, నీలాదేవి, సుంకపాక దేవయ్య, షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, సంచాలకులు కరుణాకర్, బుద్ద భవనం ప్రాజెక్టు స్పెషలాఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.