తెలంగాణ

అది పసుపు బోర్డు కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: పసుపు బోర్డు మంజూరైనట్టు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రకటనలు చేశారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. వాస్తవానికి మంజురైంది పసుపు బోర్డు కాదని, అది సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం అన్నారు.
ఇప్పటికే ఇలాంటి ప్రాంతీయ కార్యాలయాలు ఆరు ఉన్నాయని అందులో ఒకటి వరంగల్, మరొకటి గుంటూరులో ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకవస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎంపీ అర్వింద్, సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని చూపి ఇదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.