తెలంగాణ

ఐఏఎస్‌ల పోస్టింగుల్లో బీసీలకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో ఐఎఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వడంలో అన్యాయం జరుగుతోందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బదిలీ అయిన 20 మంది బీసీ వర్గాలకు చెందిన ఐఎఎస్‌లకు ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లు ఇచ్చారని ఆయన విమర్శించారు. బీసీలను పూర్తిగా విస్మరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. విశ్రాంత అధికారులకు పోస్టింగ్ ఇస్తే అవినీతి, అక్రమాలు జరుగుతాయని ఆయన అన్నారు. బీసీలకు అన్యాయాన్ని నివారించడానికి తాము ఆందోళన చేస్తమన్నారు. సీఎస్‌ను కలసిన వారిలో మంద కృష్ణమాదిగా (ఎంఆర్‌పీఎస్) రాములు నాయక్ ( చైర్మన్ రాష్ట్ర లంబాడీ హక్కుల పోరాట సమితి) చెన్నయ్య (జాతీయ అధ్యక్షుడు మాల మహానాడు) ఉన్నారు.