తెలంగాణ
ఇంటర్ ప్రాక్టికల్స్లో 22,972 మంది విద్యార్థులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 10 February 2020
హైదరాబాద్, ఫిబ్రవరి 9: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన ప్రాక్టికల్స్ పరీక్షలకు 22,972 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమై ఆదివారం వరకు తొమ్మిదిరోజులైంది. ఈ పరీక్షలకు మొత్తం 23,971 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా 22,972 మంది హాజరయ్యారు. 999 మంది గైర్హాజరు అయ్యారని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయిలో డీఈసీ కన్వీనర్, సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, హైపర్ కమిటీ సభ్యుల నేతృత్వంలో పరీక్షలు జరిగాయని వివరించారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ కార్యదర్శి ప్రకటించారు.