తెలంగాణ

24న ఈశ్వరీబాయి వర్ధంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఈ నెల 24వ తేదీన సంఘసేవకురాలు జే ఈశ్వరీబాయి వర్థంతి వేడుకలను నిర్వహించనున్నట్లు ఈశ్వరీ భాయి మెమోరియల్ ట్రస్టు చైర్‌పర్సన్ డాక్టర్ జే గీతారెడ్డి తెలిపారు. 24వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్ చర్చి వద్ద ఈశ్వరీ భాయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతిలో వర్థంతి సభ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి పాల్గొంటారు. అవార్డులను ప్రముఖ రచయిత, తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ బీ విజయ భారతి తారకంకు, భూమిక మ్యాగజైన్ ఎడిటర్ కొండవీటి సత్యవతి, సామాజిక కార్యకర్త డాక్టర్ మనీష బంగారు. తెలంగాణ బాడీ ఆర్గాన్స్ సంఘం నిర్వాహకురాలు కే భారతికి ప్రదానం చేస్తారు.