తెలంగాణ

తమిళనాడుకు తాగునీరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: తమిళనాడు రాష్ట్రానికి తాగునీరు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా అంగీకరించారు. గురువారం ప్రగతి భవన్‌లో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి, డీ జయకుమార్, పబ్లిక్ వర్క్ శాఖ కార్యదర్శి డాక్టర్ మణివాసన్, సలహాదారు ఎం షీలా ప్రియ తదితరుల బృందం సీఎం కేసీఆర్‌ను కలిసి తమ రాష్ట్రానికి తాగునీరు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా తాము సంప్రదింపులు జరపాల్సి ఉందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా తమిళనాడు ప్రభుత్వం తరఫున లేఖ రాస్తే ఆ తర్వాత మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణులు సంయుక్తంగా చర్చించి ఏకాభిప్రాయంతో తుది నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ అంశంలో తుది నిర్ణ యం తీసుకోవడానికి అధికారులంతా ఏకాభిప్రాయానికి రావాలన్నారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని సీఎం వివరించారు. ఈ కార్యాచరణ సిద్ధమైతే మూడు రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాగునీటి సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్రాల మధ్య పరస్పర సహకార వాతావరణం ఉండాలన్నారు. పొరుగు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని అన్నారు. తమిళనాడు తాగునీటి సమస్యను నీతి ఆయోగ్ సమావేశాల్లో తాను పలుమార్లు లేవనెత్తిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ విషయంపై లోక్‌సభలో టీఆర్‌ఎస్ సభ్యులు కూడా రెండు,
మూడుసార్లు మాట్లాడారని ఆయన వివరించారు. వాస్తవానికి తాగునీటి సమస్యతో తమిళనాడు ఇబ్బంది పడడమంటే దేశమంతా సిగ్గుపడాల్సిన విషయమన్నారు. దేశంలో లభించే మొత్తం 70 వేల టీఎంసీల నీటిలో సాగునీటి అవసరాలు తీరాక మరో 30 వేల టీఎంసీల నీరు మిగిలే ఉంటుందని కేసీఆర్ వివరించారు. ఇందులో 10 వేల టీఎంసీల నీటితో దేశం మొత్తానికి తాగునీటి సమస్య తీరిపోతుందన్నారు. తాగునీటి విషయమై తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని కలిగి ఉండాలని ఆ రాష్ట్ర ప్రతినిధి బృందానికి సీఎం సూచించారు. అత్యంత ప్రాధాన్యతా అంశమైన తమిళనాడు తాగునీటి అవసరాలపై దేశవ్యాప్తంగా అవగాహన అవసరమన్నారు. అందరూ సహృదయంతో అర్థం చేసుకున్నప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, భారతీయుడిగా తమిళనాడుకు సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇలాఉండగా సమావేశం నుంచే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి తమిళనాడు బృందం అభ్యర్థనను వివరించారు. ఈ అంశంలో తాను సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని కూడా చెప్పారు. తమిళనాడు తాగునీటి బాధలు తెలిసిన విషయమేనని, ఆ రాష్ట్రానికి నీరు అందించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు తెలిపారు. ప్రగతి భవన్‌కు వచ్చిన తమిళనాడు మంత్రుల బృందానికి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ సాదర స్వాగతం పలికారు.