తెలంగాణ
హైదరాబాద్ మెట్రోకు మూడు జాతీయ అవార్డులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 March 2020
హైదరాబాద్, మార్చి 9: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణ రంగంతో పాటు వౌలిక వసతుల ఏర్పాటులో దూసుకుపోతున్న ఎల్ అండ్ డీ సంస్థకు ప్రతిష్టాత్మక మూడు జాతీయ వార్డులు దక్కాయని హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. బెంగళూరుకు చెందిన పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి ఈ అవార్డులను ఎల్ అండ్ టీకి చెందిన ఏ సిన్హా అందుకున్నారని ఆయన తెలిపారు. ఎల్ అండ్ టీ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 21 బిలియన్ల రెవెన్యూతో 30 దేశాల్లో ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
*చిత్రం... ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటున్న ఎల్అండ్టీ సంస్థ సీనియర్ అధికారి సిన్హా