తెలంగాణ

తెలంగాణకు ద్రోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: గోదావరి నదీ జలాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (23న) చేసుకోనున్న ఒప్పందాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్ర సిఎం ఫడ్నవీజ్‌తో ఒప్పందం చేసుకోవడాన్ని తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని ఆయన తెలిపారు. కుట్రపూరితమైన ఒప్పందాల వల్ల జరిగే దీర్ఘకాలిక నష్టం గురించి ప్రజలకు తెలియకుండా ఉండేందుకు ఇదొక చారిత్రాక ఒప్పందం, మహా ఒప్పందం అంటూ ఒక బూటకపు ప్రచారం చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ కుట్రను ప్రజల్లో ఎండగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు.