తెలంగాణ

ముసాయిదా యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: జిల్లాల పునర్విభజన ముసాయిదాలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపించటం లేదు. కొత్త జిల్లాలకు నిధుల కేటాయింపు అంశంతో పరోక్షంగా ప్రభుత్వమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రజా స్పందన, అధికారుల కసరత్తు తరువాత చేర్పులు, మార్పులు ఉంటాయని సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించినప్పటికీ, కొత్త జిల్లాల్లో వౌలిక సదుపాయాలకు బుధవారం జరిగిన నిధుల కేటాయింపులతో ముసాయిదాలో మార్పులు ఉండవన్న విషయం అవగతమవుతోంది. జిల్లాల పునర్విభజన నుంచి మినహాయించిన హైదరాబాద్ వినా మిగతా 9 పాత జిల్లాలు, 17 కొత్త జిల్లాలకు మాత్రమే ప్రణాళిక శాఖ బుధవారం నిధులు విడుదల చేసింది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల, వరంగల్ జిల్లా జనగామ రెంటినీ జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లను సర్కారు పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విషయం నిధుల కేటాయింపుతో తేలిపోయింది. ఇలావుండగా దసరా నుంచి మనుగడలోకి రానున్న కొత్త జిల్లాల్లో వౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడానికి జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.26 కోట్లను ప్రణాళిక శాఖ విడుదల చేసింది. నిధుల కేటాయింపు నుంచి హైదరాబాద్ జిల్లాను మినహాయించినట్టు పేర్కొంది. హైదరాబాద్ వినా ఇతర 9 జిల్లాల్లోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుండటంతో వాటికి మాత్రమే నిధులు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న 17 జిల్లాలతోపాటు ప్రస్తుత 9 జిల్లాలు (హైదరాబాద్ వినా) కలిపి 26 జిల్లాలకు జిల్లాకు రూ. కోటి చొప్పున కేటాయిస్తున్నట్టు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బిపి ఆచార్య పేర్కొన్నారు. నిధులను కొత్త జిల్లాల్లో రవాణా, ఫర్నీచర్, ఫైళ్లు, కంప్యూటర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ సమకూర్చుకోవడానికి వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజిస్తుండటంతో, ఆ జిల్లాకు అధికంగా రూ.4 కోట్లు కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాలను రెండేసి జిల్లాలుగా విభజిస్తుండటంతో వాటికి రూ.2 కోట్ల చొప్పున కేటాయించినట్టు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను మూడేసి జిల్లాలుగా విభజిస్తుండటంతో వాటికి రూ.3 కోట్లు చొప్పున కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి రూ.5173 కోట్ల నుంచి ప్రస్తుత నిధులను కేటాయించినట్టు ప్రణాళిక శాఖ పేర్కొంది.