తెలంగాణ

నిజాయితీగూడెంలో దారుణం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, సెప్టెంబర్ 10: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలో దారుణం జరిగింది. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలిపై ఓ కామాంధుడు అత్యాచారం జరిపి, అనంతరం హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. ఈ హృదయ విదారక ఘటన మండలంలోని చెం జర్ల గ్రామ పరిధిలోని నిజాయితీగూడెంలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజాయితీగూడెంకు చెందిన గడ్డి కనుకమ్మ (63) అనే వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తోంది. దీనిని గమనించిన ఇదే గ్రామానికి చెందిన కాల్వ రాజు (22) అనే యువకుడు శుక్రవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారం చేసి అనంతరం తలపై బకెట్‌తో దాడి చేసి హత్య చేశాడు. విషయం తె లుసుకున్న గ్రామస్థులు ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కరీంనగర్ డిఎస్పీ రామారావు, తిమ్మాపూర్ సిఐ వెంకటరమణ, మానకొండూర్ ఎస్‌ఐ వంశీక్రిష్ణ వెంటనే చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత జనవరి 21న ఇదే గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిపై కాల్వ రాజు అత్యాచారం చేయగా, అప్పడు ఆ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేశారు. తాజాగా ఇదే కామాంధుడి కన్ను కనుకమ్మపై పడింది. ఎనిమిది నెలల వ్యవధిలో ఇద్దరు వృద్ధురాళ్లపై అత్యాచార ఘటనలు జరగడంతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనలో నిందితుడు రాజుతోపాటు అతనికి సహకరించిన తల్లి కొంరమ్మ, అన్న శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశామని, పస్తుతం ఈ ముగ్గురు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని డిఎస్పీ రామారావు తెలిపారు.