తెలంగాణ

భర్త వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 10: వరంగల్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తాగుబోతు భర్త వేధింపులు భరించలేక తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శనివారం వరంగల్ నగరంలోని హన్మకొండ మిలీనియం బజారులో జరిగింది. ములుగు మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన అలుగోజు శోభన్‌బాబు, కేసముద్రంకు చెందిన ఉమతో వివాహమైంది. వీరు బతుకుదెరువుకోసమని హన్మకొండకు వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉమ టైలరింగ్ పనిచేస్తుండగా భర్త శోభన్‌బాబు ఏ పనిచేయకుడా తాగుడుకు బానిసై జులాయిగా తిరిగేవాడు. నిత్యం భార్యను డబ్బులకోసం వేధించేవాడు. ఈనేపథ్యంలో రెండు రోజుల కిందట భార్య, పిల్లలను తీవ్రంగా కొట్టి ఇంటి నుండి వెళ్లిపోయాడు. తాను తిరిగి వచ్చే వరకు ఇంట్లో ఉంటే అందరినీ చంపుతానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉమ (33) వేకువజామున తన ఇద్దరు పిల్లలు కౌషిక్ (10) విన్మయ్ (8)లకు విషం ఇచ్చి, తాను కూడా విషం తీసుకొని ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం 10 గంటలు దాటినా తలుపు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి తలుపుతీయగా తల్లి, ఇద్దరు పిల్లల అప్పటికే చనిపోయి ఉన్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సుబేదారి సిఐ వాసాల సతీష్ సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.