తెలంగాణ

కరీంనగర్ జిల్లాలో దారుణం ముఖం చెక్కి మర్మాంగం కోసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, సెప్టెంబర్ 11: కరీం నగర్ జిల్లా గోదావరిఖని లో కొం తకాలంగా స్తబ్ధంగా ఉందనుకున్న రౌడీయిజం... గుం డాయిజం... ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయ. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత దారుణ హత్యకు గురి కావడం తీవ్ర సంచలనాన్ని రేకెత్తిం చిం ది. ముఖం చెక్కి... మర్మాంగం కో సి... దారుణ హత్యకు పాల్పడడం చర్చనీయాంశమైంది. అప్పటివరకు గుర్తు తెలియని మృతదేహమేనని అంతా అనుకున్నారు. అయతే, అది కాస్తా కాంగ్రెస్ నేత దార వీరాస్వామి దారుణ హత్యకు గురయ్యాడనే విషయం బయటకు పొక్కడంతో అంతా నివ్వెరపోయారు. గోదావరిఖని శివాజీనగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దార వీరాస్వామి (57) మార్కండేయ కాలనీ సమీపంలోని దుర్గా నగర్‌లో హత్యకు గురయ్యాడన్న విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. గోదావరిఖని పోలీసుల వివరాల ప్రకారం... దార వీరాస్వామి గోదావరిఖని మార్కండేయ కాలనీ సమీపంలోని దుర్గా నగర్‌లో హత్యకు గురైనట్లు తెలిపారు. మృతుని భార్య రాధాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాం తం జనగామ ప్రాంతానికి చెందిన ఓ భూ వివాదం కేసులో కొద్ది రోజులుగా చాప కింద నీరులా జరుగుతున్న వ్యవహారం ఈ హత్యకు దారి తీసిన్నట్లు ప్రచారం జరుగుతోంది. భూ వివాదాల వ్యవహారంతో జరిగిన హత్యగా ప్రచారం జరుగుతున్నప్పటికీ మర్మాంగం కోసి ఉండడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. గోదావరిఖని సబ్ డివిజన్ ఎఎస్పీ విష్ణు ఎస్ వారియర్, సి ఐ ఆరె వెంకటేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకొని ఈ విషయమై పూర్తి స్థాయిలో వివరాలను ఆరా తీస్తున్నారు.
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ?
దార వీరాస్వామి హత్య గురైన వ్యవహారంపై పోలీసులు గంటల వ్యవధిలోనే లోతుగా శోధన చేసిన క్రమంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసు అధికారులు విచారణ అనంతరం హత్యకు గల కారణాలు తేటతెల్లం కానుంది.

హత్యకు గురైన
వీరాస్వామి (ఫైల్‌ఫొటో)