తెలంగాణ
మధ్యాహ్న భోజనం చార్జీల పెంపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 2 October 2016
హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పిల్లలకు ఇస్తున్న మధ్యాహ్న భోజనానికి సంబంధించిన చార్జీలను ప్రభుత్వం పెంచింది. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఇప్పటి వరకు ఒక్కొక్కరికి ఖర్చుచేస్తున్న 4.86 రూపాయలను 6.13 రూపాయలకు, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులతో పాటు తొమ్మిది, పదోతరగతి విద్యార్థులకు ఇప్పటి వరకు ఖర్చు చేస్తున్న 6.78 రూపాయలను 8.18 రూపాయలకు పెంచారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.