తెలంగాణ

ప్రజలకు ద్రోహం చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: సుపరిపాలన సాగించి బంగారు తెలంగాణను ఆవిష్కరించి తీరుతామే కానీ ప్రజలకు ఎప్పటికీ ద్రోహం చేయబోమని, ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే ఉరేసుకొని చస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ రైతు పరామర్శ యాత్రలు, సిపిఎం మహాజన పాదయాత్రలు చేస్తామంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్ల పాటు ఆటుపోట్లను ఎదుర్కొని తెలంగాణ సాధించిన ఘనత కెసిఆర్‌ది అని ఆయన తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన నేత అని అన్నారు. రెండున్నర ఏళ్లుగా అనేక లోటు పాట్లు, ఇబ్బందులు ఉన్నా వాటిని లెక్క పెట్టకుండా సమర్థవంతమైన పాలన సాగిస్తున్నారని అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలు, ఎన్నికల్లో అభాసుపాలైన పార్టీలు తెలంగాణ రావడం ఇష్టం లేని పార్టీలు ఇప్పుడు విషం కక్కుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బిజెపి, టిడిపి, సిపిఎంలు తెలంగాణపై విషం కక్కుతున్నాయని మంత్రి తుమ్మల మండిపడ్డారు.