తెలంగాణ

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్: మావోయిస్టు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 8: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఆవుపల్లి అడవుల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. బీజాపూర్ ఎస్పీ కెఎల్ ధృవ్ తెలిపిన వివరాల ప్రకారం ఆవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుబాయ్‌గూడ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో డిఆర్‌జి, ఎస్టీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారని, భద్రతా బలగాలు కూడా ప్రతికాల్పులకు దిగారు. దీనితో దాదాపు రెండు గంటల పాటు హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయని ఎస్పీ వెల్లడించారు. మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ సమీప అడవుల్లోకి జారుకున్నారు. మృతదేహంతో పాటు 303 రైఫిల్ లభ్యమైంది. ఇతర ఆయుధాలు, విప్లవసాహిత్యం, నిత్యావసర సరుకులు కూడా దొరికినట్లు ఎస్పీ తెలిపారు. కాగా 2014 జూన్ నుంచి జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 303 రైఫిల్స్ 20 స్వాధీనం చేసుకున్నామన్నారు.