తెలంగాణ

మహబూబ్‌నగర్ కలెక్టర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెబ్బేరు, అక్టోబర్ 8: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై కలెక్టర్ వాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో జిల్లా కలెక్టర్ టి.కె శ్రీదేవి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనంలో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో కలెక్టర్ సురక్షితంగా బయటపడినా, ఆమె ప్రయాణిస్తున్న వా హనం దెబ్బతింది. ఎస్‌ఐ ఓ.డి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీదేవి అలంపూర్ వెళ్తుండగా రంగాపూర్ బైపాస్ సమీపంలో గద్వాల నుండి వస్తున్న ఆటో మలుపు వద్ద ఢీకొన్నాయి. ఆటోలో వెళ్తున్న డ్రైవర్ నాగరాజుకు స్వల్ప గా యాలు కాగా లక్ష్మిదేవమ్మకు చెయ్యి విరిగింది. నర్సప్ప అనే వ్యక్తికి కూడా స్వల్ప గాయా లయ్యాయి. పద్మమ్మ అనే మహిళ ప్రమాదం నుంచి బయటపడింది. వీరికి ప్రథమ చికిత్స ప్రాథమిక వైద్య కేంద్రంలో నిర్వహించారు. మెరుగైన వైద్యం అందించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఆర్డీఓ రాంచందర్ తెలిపారు.