ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగలమర్రి, అక్టోబర్ 15: కర్నూలు జిల్లా చాగలమర్రి వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వారు. స్కార్పియో వాహనం డివైడర్‌ను ఢీకొని బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో గల నాగార్జున అపార్టుమెంటులో నివాసం ఉంటున్న విశ్రాంత ఉపాధ్యాయులు రంగరాజు(64), విశ్రాంత ఉద్యోగి కనకరాజు(72), సచివాలయ ఉద్యోగి రామకృష్ణరాజు (52), రియల్ ఎస్టేట్ వ్యాపారి సుబ్బరాజు(60) అక్కడికక్కడే మృతి చెందారు. నరసింహమూర్తి రాజు, రామ్మోహన్, వాహనం నడుపుతున్న కృష్ణరావు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు స్నేహితులు స్కార్పియో వాహనంలో పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరారు. తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్, చిత్తూరు జిల్లాలోని కాణిపాకం, తిరుపతిలో దైవదర్శనం చేసుకుని శ్రీశైలం వెళ్తుండగా శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో చాగలమర్రి వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. దీంతో వాహనంలోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.