తెలంగాణ

ఉసురుతీసిన రోడ్డు గుంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా గార్ల మండలం తంగళ్లుపేటకు చెందిన అరుణ్‌కుమార్ (26) ఎంటెక్ పూర్తి కావడంతో అమీర్‌పేట్‌లో జావా కోచింగ్ సెంటర్‌లో చేరాడు. శుక్రవారం ఉదయం హఫీజ్‌పేటకు చెందిన సోమశేఖర్‌తో కలసి అమీర్‌పేట్‌కు వెళ్తున్న క్రమంలో కూకట్‌పల్లి వైజంక్షన్ సమీపంలో బాలానగర్ వైపు నుండి వెళ్తున్న సమయంలో, రోడ్డుపై గుంత ఉండటంతో బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న సోమశేఖర్, అరుణ్‌కుమార్ వాహనాన్ని తప్పించడం కోసం సడన్ బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న అరుణ్‌కుమార్ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమైంది. దీంతో అక్కడికక్కడే అరుణ్‌కుమార్ మృతిచెందగా బైక్ నడుపుతున్న సోమశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.

చిత్రం... ప్రమాదం జరిగిన ప్రదేశంలో అరుణ్‌కుమార్ మృతదేహం