తెలంగాణ

పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి.. మృత్యు కౌగిలిలోకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీబీనగర్, అక్టోబర్ 23: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామ శివారులో గల మధుపాల ఎస్టేట్ సమీపంలో చిన్ననీటివాగు గంగిరేనిగుండ్ల వద్ద ఈతకని వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భువనగిరి పట్టణంలోని ఆర్.బి.నగర్‌కు చెందిన మేడిగ నిఖిల్ (15), కిసాన్‌నగర్‌కు చెందిన సోమవరపు సాయి కుమార్ (15), ఇదే పట్టణానికే చెందిన రేపాల రంజిత్ పుట్టినరోజును పురస్కరించుకుని 11 మంది విద్యార్థులు బీబీనగర్‌కు వచ్చారు. గూడూరు గ్రామానికి చెందిన భాను, భువనగిరి మండలం కూనూరు గ్రామానికి చెందిన శివప్రసాద్‌ల సలహా మేరకు గూడూరు సమీపంలో గల చిన్ననీటివాగు గంగిరేణిగుండ్ల వద్ద పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. వేడుకలలో భాగంగా ఈతకని వెళ్లి, నీటిలో మునిగి నిఖిల్, సాయికుమార్ మృత్యువాతపడ్డారు. మృతులిద్దరూ భువనగిరి ప్రెసిడెన్సీ హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులుగా సమాచారం. విద్యార్థుల మృతితో పట్టణంలోని ఆర్.బి.నగర్, కిసాన్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలకు పంచనామా నిర్వహించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు భువనగరి రూరల్ సిఐ అర్జునయ్య తెలిపారు.